జగన్ వచ్చాక రాష్ట్రానికి శని
ABN , First Publish Date - 2022-05-17T08:48:38+05:30 IST
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ర్టానికి శని పట్టిందని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ ఉత్తరాంధ్రఇన్చార్జి బుద్దా వెంకన్న చెప్పారు. రాష్ట్రంలోనూ త్వరలో శ్రీలంక తరహా
సైకో సీఎంను చూసి అధికారుల్లో భయం
ఏదైనా మాట్లాడితే కేసుల్లో ఇరికిస్తున్నారు
రాష్ట్రంలోని అన్ని వర్గాల్లోనూ ఆవేదన
శ్రీలంక తరహా తిరుగుబాటు తప్పదు: బుద్దా వెంకన్న
విజయవాడ(వన్టౌన్), మే 16: జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ర్టానికి శని పట్టిందని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ ఉత్తరాంధ్రఇన్చార్జి బుద్దా వెంకన్న చెప్పారు. రాష్ట్రంలోనూ త్వరలో శ్రీలంక తరహా తిరుగుబాటు వస్తుందని, రాజపక్స తరహాలో జగన్ దిగిపోయే రోజు వస్తుందని పేర్కొన్నారు. సోమవారం విజయవాడలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పరిణామాలు చూసి అన్ని వర్గాలు ఆవేదనతో ఉన్నాయన్నారు. టీడీపీకీ ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి జగన్కు చెమటలు పడుతున్నాయని చెప్పారు. ఏదైనా మాట్లాడితే భయపెట్టి, బెదిరించి కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. పాదయాత్ర సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహాలకు పూలదండలు వేసిన జగన్.. ఇప్పుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు నిర్వహించడానికి కలెక్టర్ నుంచి అనుమతులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
టీడీపీకి ఉన్న ఆదరణను చూసి ఓర్వలేకే మహానాడును అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. జగన్ పాదయాత్రను చంద్రబాబు అడ్డుకోలేదని, కుక్కలా వాగినా కుక్కల బండిలో ఎక్కించకుండా వదిలేశారన్నారు. సైకో సీఎంను చూసి అధికారులు కూడా భయపడిపోతున్నారన్నారు. టీడీపీ చేతులు కట్టుకుని కూర్చోలేదని, ఎన్ని అడ్డంకులు పెట్టినా మహానాడు నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. జగన్ మడం తిప్పినా, చంద్రబాబు మడం తిప్పరన్నారు.