ఆదివాసీ బతుకుల్లో నవోదయాన్ని తెచ్చిన టీడీపీ: లోకేష్
ABN , First Publish Date - 2020-08-09T22:06:03+05:30 IST
ఆదివాసీ బతుకుల్లో నవోదయాన్ని తెచ్చిన టీడీపీ పాలనకు.. గిరిజనులపై అహంకారపూరిత దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైసీపీ పాలనకు ఎంత తేడా? అని ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రశ్నించారు.
అమరావతి: ఆదివాసీ బతుకుల్లో నవోదయాన్ని తెచ్చిన టీడీపీ పాలనకు.. గిరిజనులపై అహంకారపూరిత దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైసీపీ పాలనకు ఎంత తేడా? అని ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రశ్నించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ముందు ఏపీలో కొన్ని దారుణమైన వార్తలు వినాల్సి వచ్చినందుకు బాధగా ఉందన్నారు. కనీసం ఇకనుంచైనా గిరిజనుల పట్ల పాలకుల దృక్పథం మారాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ గిరిజన సోదరులందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.