పోల్ మేనేజ్‌మెంట్‌పై టీడీపీ శిక్షణ

ABN , First Publish Date - 2022-09-02T03:02:13+05:30 IST

జిల్లా పరిధిలోని బుట్టాయగూడెంలో ఉన్న టీడీపీ క్యాంపు కార్యాలయంలో గురువారం పోల్ మేనేజ్‌మెంట్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆ పార్టీ..

పోల్ మేనేజ్‌మెంట్‌పై టీడీపీ శిక్షణ

బుట్టాయగూడెం, (ఏలూరు జిల్లా): జిల్లా పరిధిలోని బుట్టాయగూడెంలో ఉన్న టీడీపీ క్యాంపు కార్యాలయంలో గురువారం పోల్ మేనేజ్‌మెంట్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆ పార్టీ పోలవరం నియోజకవర్గం ఇంచార్జి బొరగం శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పార్టీ క్లస్టర్ ఇంచార్జిలు, బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇంచార్జిలకు పోల్ మేనేజ్‌మెంట్, ఓటర్ వెరిఫికేషన్‌పై శిక్షణ ఇచ్చారు. వీరికి ఉండవల్లి బాలానందం అవగాహన కల్పించారు. ఓటర్ల చేర్పు, తొలగింపు తదితర అంశాలపై సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు జయవరపు శ్రీరామ్మూర్తి, శీలం వెంకటేశ్వరరావు, పోల్ మేనేజ్‌మెంట్ నియోజకవర్గం కోఆర్డినేటర్ శావిలి సుభాష్ చంద్రబోస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పారేపల్లి రామారావు, టీడీపీ మండల అధ్యక్షులు, అన్ని విభాగాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Updated Date - 2022-09-02T03:02:13+05:30 IST