టీడీపీ మద్దతుదారుడి దుకాణం కాల్చివేత

ABN , First Publish Date - 2021-09-19T05:38:43+05:30 IST

మండల పరిధిలోని పెద్దచెప్పలి గ్రామంలోని బస్టాండు వద్ద తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు చిరంజీవి అనేవ్యక్తి కూరగాయల దుకాణాన్ని శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు కాల్చివేశారు.

టీడీపీ మద్దతుదారుడి దుకాణం కాల్చివేత
కాలిపోయిన దుకాణాన్ని పరిశీలిస్తున్న సాయినాథశర్మ

కమలాపురం రూరల్‌, సెప్టెంబరు 18: మండల పరిధిలోని పెద్దచెప్పలి గ్రామంలోని బస్టాండు వద్ద తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు చిరంజీవి అనేవ్యక్తి కూరగాయల దుకాణాన్ని శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు కాల్చివేశారు. ఈయన సర్పంచ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ పక్షాన పనిచేశారు. అప్పటి నుంచి గ్రామంలోని కొంతమంది ఆయనపై కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరకాలంలోనే రెండుసార్లు ఆయన దుకాణాన్ని కాల్చివేశారు. నిరుపేదగా ఉన్న ఆయన అప్పు చేసి కుటుంబ పోషణ కోసం దుకాణాన్ని నడుపుకుంటున్నాడు. శనివారం మరోమారు దుకాణాన్ని గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారు. ఈ విషయం తెలిసి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథశర్మ పెద్దచెప్పలికి వెళ్లి అగ్నికి ఆహుతి అయిన దుకాణాన్ని పరిశీలించారు. బాధితుడికి ధైర్యం చెప్పారు. దుకాణాన్ని కాల్చినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారని, రాజకీయాలకు అతీతంగా అటువంటివారిపై కేసు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీడీపీ నాయకులు జనార్ధన, మల్లికార్జున, సుధాకర్‌, మహమ్మద్‌రఫి తదితరులు ఆయనను పరామర్శించారు.

Updated Date - 2021-09-19T05:38:43+05:30 IST