టీడీపీ రాష్ట్ర కార్యదర్శి విడుదల

ABN , First Publish Date - 2021-10-24T07:20:41+05:30 IST

ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని అరెస్టు చేసిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురజాల సందీప్‌కు చిత్తూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి విడుదల
చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో సందీప్‌కు వైద్య పరీక్షలు

చిత్తూరు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంగా అరెస్టు చేసిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురజాల సందీప్‌కు చిత్తూరు కోర్టు శనివారం రాత్రి 9గంటలకు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో విడుదలైన ఆయన  నేరుగా  చిత్తూరులోని టీడీపీ కార్యాలయం చేరుకున్నారు.ఆయనకు పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన అరెస్టు సమాచారమందగానే పార్టీ అధినేత స్పందించిన తీరుకు కృతజ్ఞతలు తెలిపారు.తన తల్లి శ్రీదేవిని, భార్య అనూషను ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పారన్నారు.అలాగే తనకు మద్దతుగా నిలిచిన టీడీపీ నేతలకు,కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, కనీసం నోటీసులివ్వకుండా సందీప్‌ను అరెస్టు చేయడం అన్యాయమని ఆయన తల్లి శ్రీదేవి, భార్య అనూష ఆందోళన వ్యక్తం చేశారు.చిత్తూరులోని తమ నివాసంలో శనివారం సాయంత్రం  వారు విలేఖరులతో మాట్లాడారు. సందీప్‌కు టీడీపీ అంటే తల్లితో సమానమని, అధినేత చంద్రబాబు అంటే చిన్నప్పటి నుంచి ఎనలేని అభిమానమన్నారు.ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కానీ.. ఇలా వేధించడం తగదన్నారు.

Updated Date - 2021-10-24T07:20:41+05:30 IST