Av Ramana: పేదల వివాహాలకు జగన్ పంగనామాలు

ABN , First Publish Date - 2022-08-08T03:47:45+05:30 IST

పేదవాళ్ల వివావాహాలకు జగన్ రెడ్డి పంగనామాలు పెట్టి అవమానించారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏవీ రమణ (Tdp State Secretary Av Ramana) అన్నారు. పేదలపై ...

Av Ramana: పేదల వివాహాలకు జగన్ పంగనామాలు

విజయవాడ: పేదవాళ్ల వివాహాలకు జగన్ రెడ్డి పంగనామాలు పెట్టి అవమానించారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏవీ రమణ (Tdp State Secretary Av Ramana) అన్నారు. పేదలపై  సీఎం జగన్ మోహన్ రెడ్డి( Cm Jagan MohanReddy)ది కపట ప్రేమ అని మరోసారి రుజువు అయిందని ఆయన ఎద్దేవా చేశారు. నెలక్రితం టీటీడీ (Ttd)పంపిన లేఖకు ఇప్పటి వరకు జగన్ రెడ్డి అనుమతినివ్వలేదని చెప్పారు. టీటీడీలో సామూహిక వివాహాలకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వేలాది పేద ప్రజల ఆశలు ఆవిరయ్యాయని పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను కించపరచడమే జగన్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చే నోట్ల కట్టలపై ఉన్న శ్రద్ధ, పేదల ఆనందం, భక్తిభావాలను గౌరవించడంపై లేదని ఏవీ రమణ మండిపడ్డారు. 

Updated Date - 2022-08-08T03:47:45+05:30 IST