మొక్కజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

ABN , First Publish Date - 2020-10-24T09:30:07+05:30 IST

మొక్కజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

మొక్కజొన్నను ప్రభుత్వమే  కొనుగోలు చేయాలి

 టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ డిమాండ్‌ 


హైదరాబాద్‌, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): మొక్కజొన్న పంటను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. కామారెడ్డి, జగిత్యాలలో ఆందోళన చేస్తున్న రైతులను అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. ఽసన్నరకాల ధాన్యాన్ని  ప్రభుత్వమే  ప్రోత్సహించి ఇప్పుడు కనీస మద్దతు ధర కల్పించకపోవడం హేయమైన చర్య అని  విమర్శించారు.  సన్నరకాలకు క్వింటాల్‌కు రూ. 2,500 చొప్పున చెల్లించాలని డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2020-10-24T09:30:07+05:30 IST