కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం అందజేయాలి

ABN , First Publish Date - 2020-07-18T10:19:34+05:30 IST

‘కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలమైంది. వైరస్‌ ప్రభావంతో వేలాది మంది మృతి చెందుతు న్నారు.

కరోనా మృతుల కుటుంబాలకు  పరిహారం అందజేయాలి

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు


రాజాం, జూలై 17 : ‘కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలమైంది. వైరస్‌ ప్రభావంతో వేలాది మంది మృతి చెందుతు న్నారు. మృతుల కుటుంబా లను ప్రభుత్వమే ఆదుకో వాలి. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.లక్ష చొప్పు న పరిహారం అందజేయాలి’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం రాజాంలో ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు రాజధాని వికేంద్రీక రణపై ఉన్న శ్రద్ధ.. కరోనా నివారణపై లేదు. గడప దాటకుండా ఎన్ని సమీక్షలు చేసినా ప్రయోజనం శూన్యం.


కొవిడ్‌ ఆసుపత్రులకు వెళ్లి వాస్తవ పరిస్థి తులు సమీక్షించాలి. ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలి’ అని తెలిపారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో బాధితుల అవ స్థలు మంత్రులకు కనిపించడం లేదా అని ప్రశ్నిం చారు. వైసీపీ నేతలు సభలు, సమావేశాలు పెట్టి నిబంధనలు ఉల్లంఘిస్తూ కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నారని మండిపడ్డారు. ఇటీవల గుం టూరులోని వైఎస్సార్‌ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న 120 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 25 మందికి పాజిటివ్‌ రావడం ఇందుకు నిదర్శనమన్నారు. 

Updated Date - 2020-07-18T10:19:34+05:30 IST