వైసీపీ దురాగతాలు సాగనివ్వం: అచ్చెన్న
ABN , First Publish Date - 2021-02-28T08:50:33+05:30 IST
అభివృద్ధే అజెండాగా టీడీపీ ఎన్నికలకు వెళ్తుంటే, అక్రమాలు, అరాచకాలే అజెండాగా వైసీపీ నేతలు ఎన్నికల బరిలో దిగుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు
అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): అభివృద్ధే అజెండాగా టీడీపీ ఎన్నికలకు వెళ్తుంటే, అక్రమాలు, అరాచకాలే అజెండాగా వైసీపీ నేతలు ఎన్నికల బరిలో దిగుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ‘జగన్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా, గెలుపు అసాధ్యమని గుర్తుంచుకోవాలి. అధికార బలం చూపాలని ప్రయత్నిస్తే, వైసీ పీ అభ్యర్థులను ప్రజలు రబ్బర్ చెప్పులు తడిపి, పేడలో ముంచి తరిమికొడతార’ని శనివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు.