కార్మికులకు ఆకలిచావులే మిగిలాయి
ABN , First Publish Date - 2021-07-27T22:58:34+05:30 IST
సీఎం జగన్మోహన్రెడ్డి జమానాలో కార్మికులకు ఆకలిచావులే మిగిలాయని ప్రభుత్వంపై టీడీపీ అధికార
అమరావతి: సీఎం జగన్మోహన్రెడ్డి జమానాలో కార్మికులకు ఆకలిచావులే మిగిలాయని ప్రభుత్వంపై టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కార్మికుల సంక్షేమనిధి నుంచి 750 కోట్ల రూపాయలను దారి మళ్లించారని రఫీ ఆరోపించారు. నిధులను దారి మళ్లించినందుకు మంత్రి జయరామ్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రూ.750 కోట్లను నెల రోజుల్లో సంక్షేమ సంఘానికి జమ చేయాలన్నారు. ఉపాధి లేక 60 మంది భవన నిర్మాణ కార్మికులు మృతి చెందారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క కుటుంబానికి కూడా సీఎం రూపాయి సాయం చేయలేదని ఆయన మండిపడ్డారు. అవినీతిపై ఉన్న శ్రద్ధ కార్మికులపై మంత్రి జయరామ్కు లేదని రఫీ విమర్శించారు.