తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీడీపీదే విజయం: పట్టాభి

ABN , First Publish Date - 2021-01-20T00:12:17+05:30 IST

దేవాలయాల పునర్నిర్మాణం పేరు మీద డ్రామాలు ఆడుతున్నారని ప్రభుత్వంపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ధ్వజమెత్తారు

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీడీపీదే విజయం: పట్టాభి

ఏలూరు: దేవాలయాల పునర్నిర్మాణం పేరు మీద డ్రామాలు ఆడుతున్నారని ప్రభుత్వంపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘దేవాలయాల పునర్నిర్మాణం నిజమైతే.. అమరావతిలో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం ఎందుకు ఆపేసారు. పోలీసులు దొంగ నాటకాలు ఆడుతున్నారు. తాడేపల్లి రాజప్రసాదం మోచేతి నీళ్ళు తాగడం మానేయండి. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీడీపీదే విజయం. తిరుపతి నుంచే ధార్మిక ప్రచారాన్ని ప్రారంభిస్తాం. హిందూ ధార్మికతను టీడీపీయే కాపాడుతుంది. బ్రదర్ అనిల్ కార్యాలయాల్లోను పోలీసులు సోదా చేయాలి. అప్పుడే హిందూ దేవాలయాలపై దాడుల కుట్ర బయటపడుతుంది’ అని పట్టాభి అన్నారు.

Updated Date - 2021-01-20T00:12:17+05:30 IST