నంద్యాలలో మీరేం చేశారు?: దివ్యవాణి
ABN , First Publish Date - 2020-11-22T08:35:52+05:30 IST
‘‘నంద్యాల ఉప ఎన్నికలలో మీ పార్టీ ఏం చేసింది? అక్కడ మీరెందుకు పోటీ పెట్టారు?’’ అని వైసీపీ ఎమ్మెల్యే రోజాని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి
అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ‘‘నంద్యాల ఉప ఎన్నికలలో మీ పార్టీ ఏం చేసింది? అక్కడ మీరెందుకు పోటీ పెట్టారు?’’ అని వైసీపీ ఎమ్మెల్యే రోజాని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి నిలదీశారు. శాసన మండలిని రద్దు చేస్తామని ప్రకటించిన నోటితోనే సీఎం జగన్ రెడ్డి దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కొడుకును మండలికి ఎమ్మెల్సీగా పంపిస్తామని ప్రకటించారన్నారు. మాట, మడమ తిప్పడంలో జగన్ కొత్త రికార్డులు సృష్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. రోజాను మించిన అద్దె మైకు మరొకరు లేరని, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మెప్పు కోసం అవతలివారిని నోటికి వచ్చినట్లు దూషించడంలో రోజా రికార్డును మరెవరూ చేరలేరని ఆమె వ్యాఖ్యానించారు.