ఉద్రిక్తంగా మారిన టీడీపీ ముట్టడి

ABN , First Publish Date - 2022-01-28T21:25:09+05:30 IST

ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఎస్ఆర్

ఉద్రిక్తంగా మారిన టీడీపీ ముట్టడి

చిత్తూరు: ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఎస్ఆర్ పురం మండలం పీవీ పురంలో టీడీపీ సానుభూతిపరుల భూముల్లో వైసీపీ నాయకులు దౌర్జన్యంగా రోడ్లు వేయడాన్ని నిరసిస్తూ పెద్దఎత్తున టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాలను టీడీపీ ముట్టడించింది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎమ్మార్వో వైసీపీ నాయకులకి అండగా నిలబడి నలభై ఏళ్ల వయసున్న చెట్లను నరికి వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల ఆస్తులపై ఇటువంటి చర్యలకు ఉపక్రమిస్తే సహించేది లేదని ఆందోళనకారులు హెచ్చరించారు. 


Updated Date - 2022-01-28T21:25:09+05:30 IST