AP News: టీడీపీ రావాలి.. చంద్రబాబే సీఎం కావాలి..

ABN , First Publish Date - 2022-08-17T01:27:43+05:30 IST

జంగారెడ్డి గూడెం(ఏలూరు జిల్లా): టీడీపీ (TDP) చేపడుతున్న ‘బాదుడే బాదుడు’ (Badude Badudu) కార్యక్రమంలో భాగంగా టీడీపీ నర్సాపురం నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు,

AP News: టీడీపీ రావాలి.. చంద్రబాబే సీఎం కావాలి..

జంగారెడ్డి గూడెం(ఏలూరు జిల్లా): టీడీపీ (TDP) చేపడుతున్న ‘బాదుడే బాదుడు’ (Badude Badudu) కార్యక్రమంలో భాగంగా టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కొయ్యలగూడెం మండలం, గవరవరం పంచాయతీ, చొప్ప రామన్నగూడెం, గవరవరం గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సీఎం జగన్ (CM Jagan) అరాచకాలను వివరిస్తున్నారు. ఈ సందర్భంగా బొరగం శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఇంధన, వంటగ్యాస్ ధరలతో పాటు విద్యుత్, బస్సు చార్జీలు, నిత్యావసరాల ధరలు పెంచేసి సామాన్యుడిపై భారం మోపుతున్నారని విమర్శించారు. మద్యంపై జే ట్యాక్స్ వసూలు చేస్తూ జగన్ తన ఖజానా నింపుకుంటున్నాడని ఆరోపించారు. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని, ప్రస్తుత పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి టీడీపీ తిరిగి అధికారంలోనికి రావడం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని..చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలకు కరపత్రాలు పంచి పెట్టారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వాడపల్లి నాగార్జున, ప్రధాన కార్యదర్శి కర్రి రాంబాబు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పారేపల్లి రామారావు,  పార్టీ పట్టణ అధ్యక్షుడు జ్యేష్ఠ రామకృష్ణ, తెలుగు యువత ఏలూరు పార్లమెంట్ కార్యదర్శి నల్లూరి గోపి, తెలుగు యువత నియోజక వర్గం అధ్యక్షుడు గన్నిన సురేంద్రనాథ్ చౌదరి, నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు చాపల చిన్నబాబు, పడమట రవి,  చిన్ని మాస్టారు, అమలాపురపు తాతారావు,  జుజ్జువరపు కిషోర్, నల్లురి రామకృష్ణ, రాచూరి సీతారామయ్య, కూనపము రామారావు, కొడమచుల కృష్ణ,  ఎండి బాషా,  తెలుగుయువత మండల అధ్యక్షుడు శివంగి సుమంత్, తెలుగు మహిళా మండల ఉపాధ్యక్షురాలు కాకి ఆదిలక్ష్మి, తెలుగు మహిళా మండల కార్యదర్శి పెండ్యాల రమాదేవి, విప్పే చందు, బొబ్బర రమేష్ తదితరులు పాల్గొన్నారు.





Updated Date - 2022-08-17T01:27:43+05:30 IST