టీడీపీ సీనియర్ నేత సాంబశివరావు మృతి
ABN , First Publish Date - 2021-04-17T05:57:12+05:30 IST
చీరాల పట్టణం కొ త్తపేటకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియ ర్ నాయకుడు కోట సాంబశివరావు(75) గు రువారం రాత్రి మృతి చెందారు. కొంతకాలం గా ఆయన అనారోగ్యంతో గుంటూరులో చికి త్స పొంది డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన కొద్ది గంటల వ్యవధిలోని ఆయన తుదిశ్వాస విడిచారు. సాంబశివరావుకు భార్య, ఇద్దరు సం తానం. కుమారుడు వాసుబాబు అమెరికాలో ఉంటున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, డాక్టర్ వరికూటి అమృతపాణిలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరికి స్వయాన మేనమామ
ఎమ్మెల్యే కరణం బలరాం, పలువురు ప్రముఖుల నివాళులు
చీరాల, ఏప్రిల్ 16 : చీరాల పట్టణం కొ త్తపేటకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియ ర్ నాయకుడు కోట సాంబశివరావు(75) గు రువారం రాత్రి మృతి చెందారు. కొంతకాలం గా ఆయన అనారోగ్యంతో గుంటూరులో చికి త్స పొంది డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన కొద్ది గంటల వ్యవధిలోని ఆయన తుదిశ్వాస విడిచారు. సాంబశివరావుకు భార్య, ఇద్దరు సం తానం. కుమారుడు వాసుబాబు అమెరికాలో ఉంటున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, డాక్టర్ వరికూటి అమృతపాణిలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. వివి ధ పార్టీల నాయకులు, పలు సంఘాల ప్రతినిధులు కొత్తపేటలోని ఆయన నివాసంలో సాంబశివరావు కుటుంబసభ్యులకు తమ ప్ర గాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర హస్తకళ ల అభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్ గొడుగుల గంగరాజు, పట్టణ పార్టీ అధ్యక్షుడు డేటా నాగేశ్వరరావు, అక్కాయపాలెం ఎత్తిపోతల సంఘం అధ్యక్షుడు పులి వెంకట్రావు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు జి.చంద్రమౌళి, కె.జనార్దనరావు సాంబశివరావు భౌతికకాయంపై పార్టీ జెండాను ఉంచి నివాళులర్పించారు. ఆ దివారం ఉదయం అంతిమయాత్ర జరుగుతుంది. కాగా కోట సాంబశివరావు అనే కన్నా టీకొట్టు సాంబయ్యగా, కోట సాంబయ్యగా చీ రాల, పర్చూరు నియోజకవర్గాల పరిధిలోని వారికి చిరపరిచితుడు. ఎమ్మెల్యే ఏలూరి సా ంబశివరావు ఆయనకు స్వయానా మేనల్లు డు. టీడీపీ ఆవిర్భావం నుంచి ప్రయాణం సాగించారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సాంబశివరావును పేరు పెట్టి పిలిచే ంతగా గుర్తింపు పొందారు. చీరాలలోని టీడీ పీ శ్రేణులకు ఆయన పెద్దదిక్కుగా, అజాతశత్రువుగా మెలిగారు. తెలుగు రైతు రాష్ట్ర అ ధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
సాంబశివరావు మృతి పార్టీకి తీరనిలోటు : ఎమ్మెల్యే
టీడీపీ సీనియర్ నేత కోట సాంబశివరావు మృతి పార్టీకి తీరనిలోటని బాపట్ల పార్లమె ంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, పర్చూరు ఎ మ్మెల్యే ఏలూరి సాంబశివరావు శుక్రవారం ఒ క ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మృతి త న ప్రగాడ సంతాపాన్ని తెలిపారు. అలాగే చీ రాల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి యడం బాలాజీ తన సంతాపాన్ని తెలిపారు.