దళితులు ఆత్మగౌరవాన్ని నిలుపుకోవాలి
ABN , First Publish Date - 2022-05-25T05:49:41+05:30 IST
దళితులు ఆత్మగౌరవాన్ని నిలుపుకోవాలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.
పాలకొల్లు అర్బన్, మే 24: దళితులు ఆత్మగౌరవాన్ని నిలుపుకోవాలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. టీడీపీ కార్యాలయంలో నియో జకవర్గ స్థాయి ఎస్సీ విభాగం సమావేశం నిమ్మల అధ్యక్షతన మంగళవారం జరిగింది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో దళిత వర్గాలకు చేసిన మేలును దళిత నాయకులే ఇంటింటికి వెళ్లి చెప్పాలన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చాక దళితులపై అనేక దాడులు, హత్యలు జరుగుతున్నాయని, ఏఒక్క సంఘటన పైనా పూర్తిస్థాయి విచారణ పూర్తి చేసి ప్రభుత్వం న్యాయం చేయలేదని విమర్శించారు. ఎస్సీ విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పసుపులేటి ప్రభుదాసు, ఉందుర్తి సురేష్, పాలపర్తి మాధవరావు, కోటి రాంబాబు, ఎల్లమిల్లి వెంకట్రావు, పీతల శ్రీను, బీరా వీరాస్వామి, పాముల రజనీకుమార్, మధు, దాసు, మాతా రత్నరాజు, సైమన్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ చేతిలో హతమైన కారు డ్రైవర్ సుబ్రహ్మణం ఆత్మశాంతి కోరుతూ గాంధీ బొమ్మల సెంటర్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేయాలని, ఉదయ్ భాస్కర్ను పదవి నుంచి తొలగించాలని నినాదాలిచ్చారు.