AP News: రేపు విజయవాడలో టీడీపీ రౌండ్‌టేబుల్ సమావేశం

ABN , First Publish Date - 2022-08-08T22:51:35+05:30 IST

Vijayawada: తెలుగుదేశం పార్టీ (TDP) మంగళవారం ఉ.10 గంటలకు విజయవాడలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనుంది. అన్ని రాజకీయ పక్షాలు, మహిళా సంఘాలు ఈ సమావేశంలో పాల్గొనాలని ఇప్పటికే టీడీపీ నాయకులు ఆహ్వానం పంపారు. వైసీపీ

AP News: రేపు విజయవాడలో టీడీపీ రౌండ్‌టేబుల్ సమావేశం

Vijayawada:  తెలుగుదేశం పార్టీ (TDP) మంగళవారం ఉ.10 గంటలకు విజయవాడలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనుంది. అన్ని రాజకీయ పక్షాలు, మహిళా సంఘాలు ఈ సమావేశంలో పాల్గొనాలని ఇప్పటికే టీడీపీ నాయకులు ఆహ్వానం పంపారు. వైసీపీ (YSRCP) పాలనలో రోజురోజుకి పెరిగిపోతోన్న పోలీస్‌, రాజకీయ నిర్బంధాలు, వేధింపులపై సమావేశంలో చర్చించనున్నారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) న్యూడ్ వీడియో నేపథ్యంలో జగన్ సర్కారు నిర్లక్ష్య వైఖరిని రౌండ్‌టేబుల్ వేదికగా ప్రశ్నించనున్నారు.  

Updated Date - 2022-08-08T22:51:35+05:30 IST