వైసీపీ పాలనలో అంతా అస్తవ్యస్తం

ABN , First Publish Date - 2022-05-16T05:30:00+05:30 IST

రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తం అయిపోయిందని కష్టాలు తొలగి మళ్లీ గాడిలో పడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్‌ బడేటి చంటి తెలిపారు.

వైసీపీ పాలనలో అంతా అస్తవ్యస్తం
పోలాసిగూడెంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేస్తున్న టీడీపీ నాయకులు

రాష్ట్రం గాడిలో పడాలంటే చంద్రబాబు రావాలి : బడేటి చంటి

ధరల పెరుగుదలపై టీడీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు


ఏలూరు టూటౌన్‌, మే 16: రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తం అయిపోయిందని కష్టాలు తొలగి మళ్లీ గాడిలో పడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్‌ బడేటి చంటి తెలిపారు. నిత్యవసర ధరల పెరుగుదలకు నిరసనగా తెలుగుదేశం చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంలో సోమవారం 25, 26 డివిజన్స్‌లో చంటి పర్య టించారు. చంటి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడేం దుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్ర బాబుని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉందన్నారు. లంకపల్లి మాణిక్యా లరావు, రాము, గణేష్‌, రమాదేవి, భాష, రంజిత్‌, శ్రీనివాస్‌, బండారు శ్రీనివాస్‌, చింతల కుమార్‌, వీ.అన్నవరం, సురేష్‌, కే.రమేష్‌, జగదీష్‌బాబు, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.  


సామాన్యుల జీవనం దుర్భరం : చింతమనేని 

పెదవేగి, మే 16 : రాష్ట్రంలో నానాటికి పెరుగుతున్న ధర లతో సామాన్యుల జీవనం దుర్భరంగా మారిందని దెందు లూరు మాజీ ఎమ్మెల్యే చింత మనేని ప్రభాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరు గుదలకు నిరసనగా పెదవేగి మండలం కొప్పాకలో టీడీపీ శ్రేణులు సోమవారం రాత్రి బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించాయి. చింతమనేని పాలనపై ధ్వజమెత్తారు. విద్యుత్‌ సరఫరా సక్రమంగా ఉండదు కానీ బిల్లులమోత మాత్రం మోగిపోతుంద న్నారు. భూముల రిజిస్త్రేషన్‌ చార్జీలు, ఇంటిపన్ను, చెత్తపన్ను, ఆర్టీసీ చార్జీలు  ఎరువులు, పురుగుమందులు ధరలతో రైతులు, ప్రజలు అల్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక, సిమెంట్‌, ఐరన్‌ వంటి భవన నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలతో ఇళ్ళ నిర్మాణాలు కుంటుపడ్డాయని, సామాన్యుల సొంతింటి కల కలగానే మిగిలి పోతోందన్నారు. ఒక్కఛాన్స్‌ అంటూ ప్రజల నడ్డివిరిచే పాలన సాగు తోందని ప్రభాకర్‌ ధ్వజమెత్తారు.  టీడీపీ నాయకులు బొప్పన సుధాకర్‌, తాతా సత్యనారాయణ, పరాశరం భాస్కర దీక్షితులు,గిరిడి అచ్చిబాబు, కోటేశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.


పోలాసిగూడెంలో కొవ్వొత్తులతో ప్రదర్శన

కామవరపుకోట, మే 16 : మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమ వారం కామవరపుకోట మండలం పోలాసిగూడెం సబ్‌స్టేషన్‌ వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన జరిపారు. కోతలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలంటూ నినాదాలు చేశారు. సీఎం వైఖరికి నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ, మాజీ జడ్పీటిసి ఘంటా సుధీర్‌ బాబు, మండల తెలుగుదేశం అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ, గ్రామ నాయకులు అబ్బూరి సాయికృష్ణ, పిన్నమనేని శ్రీని వాసరావు, ఐటీడీపీ అధ్యక్షుడు మన్యం దుర్గారావు, తొంట రాంబాబు, బొబ్బిలి డాన్‌ దివాకర్‌, మేరుగు సుందరరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-16T05:30:00+05:30 IST