మహాపాదయాత్రకు సంఘీభావంగా టీడీపీ ర్యాలీలు

ABN , First Publish Date - 2021-12-14T23:57:25+05:30 IST

రాష్ట్రంలో రాజధాని అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు

మహాపాదయాత్రకు సంఘీభావంగా టీడీపీ ర్యాలీలు

అమరావతి: రాష్ట్రంలో రాజధాని అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు సంఘీభావంగా టీడీపీ శ్రేణులు సంఘీభావ ర్యాలీలు నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. బుధవారం జోన్ 3, 4, 5 పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఈనెల 16న జోన్-1, 2 పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో సంఘీభావ ర్యాలీలు చేయాలన్నారు. రాజధాని అమరావతి ఆవశ్యకతను అందరికీ చాటి చెప్పాలని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-14T23:57:25+05:30 IST