దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా టీడీపీ దీక్ష

ABN , First Publish Date - 2020-08-15T18:08:07+05:30 IST

గుంటూరు: రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా టీడీపీ శ్రేణులు దీక్ష చేపట్టాయి.

దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా టీడీపీ దీక్ష

గుంటూరు: రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా టీడీపీ శ్రేణులు దీక్ష చేపట్టాయి. జిల్లా టీడీపీ కార్యాలయంలో చేపట్టిన దీక్షలలో మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ... జగన్ అధికారంలోకి రావడానికి దళితులు తీవ్ర కృషి చేశారన్నారు.దళితులను కొట్టే.. తిట్టే హక్కు తనకే ఉందనే విధంగా జగన్ వ్యవహరించడం బాధాకరమన్నారు.


దాడులకు పాల్పడే వారిని వైసీపీ నాయకులు సమర్ధించడం సిగ్గుచేటన్నారు. శిరోముండనం బాధితుడి లేఖపై రాష్ట్రపతి స్పందిస్తే రాష్ట్ర ప్రభుత్వం పట్టిపట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. కమిషన్ విచారణ పూర్తయ్యే వరకు జస్టిస్ ఈశ్వరయ్య, నాగార్జున రెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పదవులలో కొనసాగే అర్హత లేదని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు.

Updated Date - 2020-08-15T18:08:07+05:30 IST