AP News: గుంటూరు ఎస్పీ కార్యాలయం ఎదుట టీడీపీ నిరసన
ABN , First Publish Date - 2022-08-04T17:03:27+05:30 IST
జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట టీడీపీ నిరసన ప్రదర్శనకు దిగింది.
గుంటూరు: జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట టీడీపీ (TDP) నిరసన ప్రదర్శనకు దిగింది. సోషల్ మీడియాలో టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ (Nara lokesh) గురించి తప్పుడు ప్రచారంపై తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ ఆఫీస్ ఎదుట విజయ సాయి రెడ్డి (Vijayasai reddy), దేవేందర్ రెడ్డి (Devander reddy)ల చిత్ర పటాలను టీడీపీ నేతల చెప్పులతో కొట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జిల్లా ఎస్పీకి టీడీపీ ఇన్చార్జ్ కోవెలమూడి రవీంద్ర (Kovelamudi ravindra) వినతి పత్రం అందజేశారు.