TDP: జగన్ రూ.2 లక్షల కోట్ల దోపిడీ చేశారంటూ లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ నిరసన..

ABN , First Publish Date - 2022-09-21T16:31:22+05:30 IST

మూడేళ్లలో సీఎం జగన్ రూ. 2 లక్షల కోట్ల దోపిడీ చేశారంటూ నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ నిరసన..

TDP: జగన్ రూ.2 లక్షల కోట్ల దోపిడీ చేశారంటూ లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ నిరసన..

అమరావతి (Amaravathi): వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో సీఎం జగన్ (CM Jagan) రూ. 2 లక్షల కోట్ల దోపిడీ చేశారంటూ నారా లోకేష్ (Nara Lokesh) ఆధ్వర్యంలో టీడీపీ (TDP) శాసనసభ పక్షం నిరసన చేపట్టింది. బుధవారం ఉదయం అసెంబ్లీ సమీపంలోని ట్రాఫిక్ పీఎస్ వద్ద సహజ వనరుల దోపీడీపై ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అవినీతిలో ఏ1 జగన్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. లేపాక్షి భూములు జగన్ కుటుంబం కబ్జా చేస్తే, ఖాళీ స్థలాలను వైసీపీ ల్యాండ్ మాఫియా కబ్జా చేస్తోందని ఆరోపించారు. జగన్ రెడ్డి స్కామ్ రెడ్డిగా మారి, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారన్నారు. భూ, ఇసుక, మద్యం, మైన్స్, బియ్యం దోపిడీకి వైసీపీ నేతలు పాల్పడుతున్నారంటూ అసెంబ్లీకి కాలినడకన వెళ్లారు. ఇసుకను మింగేస్తున్న వైసీపీ ఇసుకాసురులు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. జే బ్రాండ్స్‌తో  జగన్ రెడ్డి పేదల రక్తం తాగుతున్నారని నినాదాలు చేశారు. జగన్ వాకిట్లో గంజాయి చెట్లు, సెంటు భూమి పేరుతో ప్రజాధనం లూటీ అంటూ ప్లకార్డులు చేతపట్టి నినాదించారు. మైనింగ్ మాఫియా డాన్‌గా జగన్ రెడ్డి ఉంటే.. వైసీపీ నేతలు రేషన్ బియ్యం కొట్టేస్తున్నారని, ఎర్ర చందనాన్ని వైసీపీ నేతలు ఏటిఎంగా మార్చుకున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు.

Updated Date - 2022-09-21T16:31:22+05:30 IST