ప్రజలపై మోయలేని భారం
ABN , First Publish Date - 2022-05-18T06:43:05+05:30 IST
వైసీపీ నాయకులు గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి వెళ్ళడానికి సిగ్గులేదా అని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంక టేశ్వరరావు విమర్శించారు.
బాదుడే బాదుడులో టీడీపీ నాయకులు
గోపాలపురం, మే 17 : వైసీపీ నాయకులు గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి వెళ్ళడానికి సిగ్గులేదా అని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంక టేశ్వరరావు విమర్శించారు.గుడ్డిగూడెంలో మంగళవారం నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పనితీరుపై ఆరా తీశారు. మహిళలు, వృద్ధుల ప్రభుత్వంపై విమర్శల వర్షం గుప్పించారు. భారతరాజ్యాంగం కల్పించిన భావ స్వేచ్ఛను హరించి ప్రభుత్వ పనితీరుపై గుంటూరు జిల్లాలో మాట్లాడిన ఎస్సీ మహిళపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగడం సిగ్గు చేటన్నారు. పశ్చిమగోదావరి జిల్లా లింగ పాలెంలో శ్రీనివాస్ అనే దళితుడిపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం సరికాదన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రొంగల సత్యనారా యణ, ఎంపీటీసీ బొర్రా ఆంజనేయులు, మాజీ సర్పంచ్ ఆకుల రాము, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు జగడాల ఉమానాగేశ్వరరావు, కార్యదర్శి మద్దుల శ్రీను, మాజీ ఎంపీటీసీ ప్రసాద్బాబు, అశోక్, మండల బీసీ సెల్ మాజీ అధ్యక్షుడు జామి సూర్యచంద్రం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలి..
కొవ్వూరు, మే 17 : దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో సాగనంపాలని కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణారావు అన్నారు. కొవ్వూరు మునిసిపాలిటీ రాజీవ్కాలనీలో టీడీపీ కౌన్సిలర్ బొండాడ సత్యనారాయణ ఆధ్వ ర్యంలో మంగళవారం నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జగన్ ప్రజలను పన్నుల రూపంలో బాదుతున్నారన్నారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ మాజీ చైర్మన్ సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్ (చిన్ని), సూర్యదేవర రంజిత్, పొట్రు శ్రీనివాసరావు, యనమదల సుబ్రహ్మణ్యం, పెనుమాక జయరాజు, కొప్పాక జవహర్ పాల్గొన్నారు.