ప్రజాశ్రేయస్సు కోసం టీడీపీని గెలిపించండి

ABN , First Publish Date - 2021-02-23T06:28:15+05:30 IST

గుంటూరు నగరాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం టీడీపీని గెలిపించాలని టీడీసీ పశ్చిమ ఇన్‌చార్జి కోవెలమూడి రవీంద్ర తెలిపారు.

ప్రజాశ్రేయస్సు కోసం టీడీపీని గెలిపించండి
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్న మాజీ మంత్రి డాక్టర్‌ మాకినేని రత్తయ్య తదితరులు

గుంటూరు, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): గుంటూరు నగరాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం టీడీపీని గెలిపించాలని టీడీసీ పశ్చిమ ఇన్‌చార్జి కోవెలమూడి రవీంద్ర తెలిపారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమం కింద సోమవారం ఆయన 38వ డివిజన్‌లో పర్యటించారు. తొలుత గార్డెన్స్‌లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.  అనంతరం గుజ్జనగుండ్లలోని పలుకాలనీల్లో అభ్యర్థిని మానం పద్మశ్రీతలో కలిసి ప్రచారం చేశారు. 44వ డివిజన్‌ అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసరావు రూపొందించిన ఎన్నికల ప్రచార బ్రోచర్‌ను రవీంద్ర ఆవిష్కరించారు. కార్యక్రమంలో మానం శ్రీనివాస్‌, వల్లంసెట్టి వీరయ్య, జానీబాషా, మురళీకృష్ణ, కోకా కృష్ణ, దాసు, ఉప్పల రామారావు, కన్నసాని విజయ్‌, భాష్యం నరసయ్య తదితరులు పాల్గొన్నారు. 

అరాచకపాలనకు చరమ గీతం పాడాలి


రాష్ట్రంలో వైసీపీ అరాచకపాలన సాగిస్తోందని దానికి ఓటుతో చరమగీతం పాడాలని   మాజీ మంత్రి డాక్టర్‌ మాకినేని పెదరత్తయ్య తెలిపారు. సోమవారం ఆయన 16వ డివిజన్‌లోని బుడంపాడుకాలనీలో జరిగిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు.    కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థి ఉగ్గిరాల వరలక్ష్మీ మార్కండేయులు, రాష్ట్ర కార్యదర్శి మానుకొండ శివప్రసాద్‌, డివిజన్‌ అధ్యక్షుడు చలమయ్య, నాయకులు అమర్నాథ్‌, ప్రతాప్‌, వెంకటస్వామి, నాగరాజు, హరిబాబు, ప్రభుదాస్‌, శివయ్య తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-02-23T06:28:15+05:30 IST