కాసేపట్లో టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం
ABN , First Publish Date - 2021-10-03T23:04:04+05:30 IST
కాసేపట్లో టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం కానుంది. బద్వేల్ ఉపఎన్నికలో పోటీ చేయాలా? లేదా? అనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని
అమరావతి: కాసేపట్లో టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం కానుంది. బద్వేల్ ఉపఎన్నికలో పోటీ చేయాలా? లేదా? అనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, ఇతర సమస్యలపై పొలిట్బ్యూరోలో చర్చించే అవకాశం ఉంది. సమావేశానికి హాజరు కావాల్సిందిగా పొలిట్బ్యూరో సభ్యులకు అధిష్టానం సమాచారమిచ్చింది. జూమ్ ద్వారా పొలిట్బ్యూరో సమావేశంలో సభ్యులు పాల్గొననున్నారు. కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేయాలా వద్దా అనే దానిపై టీడీపీ పునరాలోచనలో పడింది. అక్కడ మృతి చెందిన వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య, సతీమణినే వైసీపీ రంగలోకి దింపడంతో పోటీ చేయాలా వద్దా అని టీడీపీ నేతలు సమాలోనలు చేస్తున్నారు. ఇప్పటికే బద్వేలు నుంచి తప్పుకున్నట్లు జనసేన ప్రకటించడంతో బీజేపీ ఇరుకున పడింది.