సేవలే చిరస్థాయిగా నిలుస్తాయి

ABN , First Publish Date - 2021-01-27T06:16:56+05:30 IST

గొల్లప్రోలు, జనవరి 26: పదవిలో ఉండగా అందించిన సేవలు, అమలు చేసిన కార్యక్రమాలే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాయని, అందుకు దివంగత మాదేపల్లి రంగబాబు నిదర్శనమని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ అన్నారు. పిఠాపురం ఏఎంసీ మాజీ చైర్మన్‌ రంగబా

సేవలే చిరస్థాయిగా నిలుస్తాయి
గొల్లప్రోలులో పేదలకు దుస్తులు పంపిణీ చేస్తున్న వర్మ

మాజీ ఎమ్మెల్యే వర్మ

గొల్లప్రోలు, జనవరి 26: పదవిలో ఉండగా అందించిన సేవలు, అమలు చేసిన కార్యక్రమాలే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాయని, అందుకు దివంగత మాదేపల్లి రంగబాబు నిదర్శనమని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ అన్నారు. పిఠాపురం ఏఎంసీ మాజీ చైర్మన్‌ రంగబాబు జయంతి సందర్భంగా మంగళవారం ఆయన విగ్రహానికి వర్మ, టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు దుస్తులు పంపి ణీ చేశారు. రంగబాబు ఆశయ సాధనకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని, ఎన్నికల్లో పార్టీ విజయానికి తోడ్పాటు అందించాలని వర్మ కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T06:16:56+05:30 IST