సజ్జల రామకృష్ణారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి: పట్టాభిరామ్

ABN , First Publish Date - 2022-01-06T00:18:34+05:30 IST

సజ్జల రామకృష్ణారెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని టీడీపీ నేత పట్టాభిరామ్ హెచ్చరించారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నడిరోడ్డు మీద నిలబెడతామన్నారు.

సజ్జల రామకృష్ణారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి: పట్టాభిరామ్

అమరావతి: సజ్జల రామకృష్ణారెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని టీడీపీ నేత పట్టాభిరామ్ హెచ్చరించారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నడిరోడ్డు మీద నిలబెడతామన్నారు. ఏ అంశం మాట్లాడినా ఆధారాలతోనే టీడీపీ నేతలు మాట్లాడతారని ఆయన చెప్పారు. మద్యం షాపుల్లో క్యాష్ ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సాయంత్రానికి నల్లడబ్బు కంటైనర్లలో తాడేపల్లికి చేరుతోందని ఆరోపించారు. జేపీ వెంచర్ పేరుతో ఇసుక రీచ్‌లను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. దేశంలో మత్తు పదార్థాలు ఎక్కడ పట్టుబడ్డా మూలాలు ఏపీ అని తేలుతోందన్నారు. మారిటైం బోర్డులోని రూ.1200 కోట్లను దారి మళ్లించారని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-01-06T00:18:34+05:30 IST