పట్టాభితో మాట్లాడిన చంద్రబాబు

ABN , First Publish Date - 2021-10-20T00:28:10+05:30 IST

టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు చేరుకున్నారు. పట్టాభితో పాటు పార్టీ కార్యకర్తలతోనూ...

పట్టాభితో మాట్లాడిన చంద్రబాబు

అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు చేరుకున్నారు. పట్టాభితో పాటు పార్టీ కార్యకర్తలతోనూ మాట్లాడారు. దాడి వివరాలను చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు  వివరించారు. చంద్రబాబు వెంట దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, ముఖ్యనేతలు కూడా కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. 


కాగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేశారు. గేట్లు నెట్టుకొని టీడీపీ కేంద్ర కార్యాలయం లోపలికి వైసీపీ శ్రేణులు వెళ్లారు. కార్యాలయంలో కనపడినవారిపై దాడి, అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు. దాడి ఘటనలో నలుగురు టీడీపీ శ్రేణులకు తీవ్రగాయాలయ్యాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో దొరబాబు, భద్రి, అనిల్, విద్యాసాగర్ ఉన్నారు. విశాఖ, తిరుపతి, గుంటూరులోని టీడీపీ కార్యాలయాలపైనా వైసీపీ శ్రేణులు దాడులు చేశారు. టీడీపీ నేత పట్టాభి నివాసంపై కూడా దాడి జరిగింది. పలు విలువైన వస్తువులు ధ్వంసం చేశారు.  పక్కా ప్రణాళికతో టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు చేశారు. 



Updated Date - 2021-10-20T00:28:10+05:30 IST