చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

ABN , First Publish Date - 2021-07-16T21:25:49+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ఈ సమావేశానికి ఎంపీ జయదేవ్, రామ్మోహన్‌నాయుడు

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ఈ సమావేశానికి ఎంపీ జయదేవ్, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్ర హాజరైనారు. సుమారు 18 అంశాలపై పార్లమెంటరీ పార్టీ భేటీలో చర్చించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు, ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్, జల వివాదంపై చర్చిస్తారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.

Updated Date - 2021-07-16T21:25:49+05:30 IST