శ్రీసత్యసాయి జిల్లాలో Palle raghunath reddy ధర్నా
ABN , First Publish Date - 2022-06-21T18:15:23+05:30 IST
జిల్లాలోని కొత్తచెరువు తహసిల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ధర్నాకు దిగారు.
శ్రీ సత్య సాయి: జిల్లాలోని కొత్తచెరువు తహసిల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి(Palle raghunath reddy) ధర్నాకు దిగారు. రైతులందరికీ పంటల బీమా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కొత్తచెరువు తాహసిల్దార్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ... రైతులకు పంట నష్టపరిహారం అందించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. పంటల బీమా చెల్లింపులో తీవ్ర అన్యాయం జరిగిందని, రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి శనిలా దాపురించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల జీవన విధానం అగమ్యగోచరంగా తయారైందన్నారు. తక్షణమే రైతులందరికీ ఇన్సూరెన్స్ ఇవ్వకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని పల్లె రఘునాథ్ రెడ్డి డిమాండ్ చేశారు.