సుప్రీం తీర్పు వైసీపీకి చెంపపెట్టు

ABN , First Publish Date - 2021-01-27T05:54:03+05:30 IST

పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి గొర్రెల శ్రీఽధర్‌ అన్నారు.

సుప్రీం తీర్పు వైసీపీకి చెంపపెట్టు
విలేకరులతో మాట్లాడుతున్న గొర్రెల శ్రీధర్‌, తదితరులు

తాడేపల్లిగూడెం, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) :  పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి గొర్రెల శ్రీఽధర్‌ అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో మంగళవారం విలేకరుల సమావేశంలో పలువురు టీడీపీ నాయకులతో కలిసి ఆయన మాటా ్లడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళితే అక్కడ కూడా భంగపాటు తప్పలేదన్నారు. దీనిని ప్రజలంతా గమనిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌ చార్జి విషయంలో  అధిష్ఠానం స్పష్టత ఇవ్వాలని, స్థానిక నాయకత్వాన్ని పరి గణనలోకి తీసుకోవాలని ఈ సం దర్భంగా బడుగు పెద్ద అన్నారు. లేదంటే పార్టీ బాధ్యతలు నిర్వహించలేనని స్పష్టం చేశారు. సమావేశంలో కిల్లాడి ప్రసాద్‌, దాట్ల జగన్నాథరాజు, సబ్నివీసు కృష్ణమోహన్‌, మద్దిపాటి ధర్మేంద్ర, మారి శెట్టి సుబ్బారావు మాట్లాడారు. నియోజకవర్గ నాయక త్వ విషయంలో స్పష్టత ఇస్తే అంతా కలసి కట్టుగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

Updated Date - 2021-01-27T05:54:03+05:30 IST