రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ప్రభుత్వ విఫలం

ABN , First Publish Date - 2022-01-27T04:56:41+05:30 IST

విలువలకు కట్టుబడి స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వ అనే పునాదుల మీద రాజ్యాంగాన్ని రాస్తే, ఆ పునాదులు ఏపీలో కూలిపోయే ప్రమాదంలో ఉందని జిల్లా టీడీపీ నేతలు అవేదన వ్యక్తం చేశారు.

రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ప్రభుత్వ విఫలం
పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయజెండాను అవిష్కరిస్తున్న టీడీపీ నేతలు శ్రావణ్‌ కుమార్‌, నసీర్‌, నాని తదితరులు

గణతంత్ర వేడుకల్లో టీడీపీ నేతలు

గుంటూరు, జనవరి 26(ఆంధ్రజ్యోతి): విలువలకు కట్టుబడి స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వ అనే పునాదుల మీద రాజ్యాంగాన్ని రాస్తే, ఆ పునాదులు ఏపీలో కూలిపోయే ప్రమాదంలో ఉందని జిల్లా టీడీపీ నేతలు అవేదన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. అందులో భాగంగా గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ జాతీయ జెండాను అవిష్కరించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసుల ద్వారా పాలన చేస్తూ పరిపాలకులే ప్రజలు ఇబ్బంది పెడుతూ డాక్టర్‌ అంబేద్కర్‌ రాసిజూ రాజ్యాంగం రాష్ట్రంలో అమవలవుతుందా అనే అనుమానం కలగజేస్తున్నారని విమర్శించారు. కనీసం మాట్లాడే హక్కును కూడా వైసీపీ ప్రభుత్వం హరించివేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నేతలు మహ్మద్‌ నసీర్‌, కోవెలమూడి రవీంద్ర, మన్నవ మోహనకృష్ణ, దాసరి రాజామాష్టారు, డేగల ప్రభాకర్‌, మద్దిరాల జోసఫ్‌ ఇమ్యానుయేల్‌, మానుకొండ శివప్రసాద్‌, కంచర్ల శివరామయ్య, ధారునాయక్‌, నూతలపాటి రామారావు, రావిపాటి సాయి, అన్నాబత్తుని జయలక్ష్మి, తలతోటి సురేంద్ర, డీఎస్‌ఆర్‌, కొనకళ్ల సత్యనారాయణ, కసుకుర్తి హనుమంతరావు, చందవోలు శోభారాణి, కొత్తూరి వెంకట్‌, పోతురాజు చంద్రశేఖర్‌ ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-27T04:56:41+05:30 IST