ఆత్మహత్య చేసుకున్న రైతు ఫ్యామిలీకి.. టీడీపీ ఎన్నారైల ఆర్థిక సాయం

ABN , First Publish Date - 2021-03-04T00:56:52+05:30 IST

ఆర్థిక కష్టాలతో ఆత్మహత్యకు పాల్పడిన కృష్ణా జిల్లా రైతు మోర్ల నాగభూషణం కుటుంబాన్ని తెలుగుదేవం పార్టీ ఎన్నారైలు ఆర్థిక సహాయం అందించారు.

ఆత్మహత్య చేసుకున్న రైతు ఫ్యామిలీకి.. టీడీపీ ఎన్నారైల ఆర్థిక సాయం

కృష్ణా: ఆర్థిక కష్టాలతో ఆత్మహత్యకు పాల్పడిన కృష్ణా జిల్లా రైతు మోర్ల నాగభూషణం కుటుంబాన్ని తెలుగుదేవం పార్టీ ఎన్నారైలు ఆర్థిక సహాయం అందించారు. నివర్ తుఫాను ధాటికి పంట నాశనం కావడంతో దిగుబడి తగ్గింది. అదే సమయంలో బ్యాంకులో తీసుకున్న పంట రుణం తీర్చే దారి లేకపోవటంతో కృష్ణా జిల్లా పెనమలూరు గ్రామానికి చెందిన కౌలు రైతు మోర్ల నాగభూషణం(46) ఫిబ్రవరిలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ ఫిబ్రవరి 19న నాగభూషణం మృతి చెందాడు. ఈయన టీడీపీ సానుభూతిపరుడు. ఇక నాగభూషణం కుటుంబ ఆర్ధిక పరిస్థితిని చూసి చలించి టీడీపీ, పెనమలూరు గ్రామానికి చెందిన ఎన్నారైలు కలిసి 2,50,000 రూపాయలు నగదు సేకరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేతుల మీదుగా రూ. 2.50 లక్షల చెక్కును నాగభూషణం పెద్ద కుమారుడు మోర్ల నాగేంద్రబాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నారైలతో పాటు చమళ్ళమూడికి చెందిన  యడ్లపల్లి వాణి తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-03-04T00:56:52+05:30 IST