రూ.10 లక్షలు ఇవ్వాలి
ABN , First Publish Date - 2021-06-17T05:15:02+05:30 IST
కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం ప్రభుత్వం చెల్లించాలని, తెల్లరేషన్ కార్డుదారులకు రూ. రూ. 10 వేలు ఆర్థిక సాయం అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయు డు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల, ఎమ్మెల్సీ అంగర డిమాండ్
టీడీపీ శ్రేణుల ధర్నా
పాలకొల్లు అర్బన్, జూన్ 16 :కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం ప్రభుత్వం చెల్లించాలని, తెల్లరేషన్ కార్డుదారులకు రూ. రూ. 10 వేలు ఆర్థిక సాయం అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయు డు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం టీడీపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదల కడుపు నింపాలని సూచిం చారు. డిప్యూటీ తహసీల్దార్ బ్రహ్మాజీకి వినతిపత్రం అందించారు. టీడీపీ నాయకులు జీవీ పెచ్చెట్టి బాబు, వల్లభు శ్రీనివాస్, ధనాని ప్రకాశ్, ఎం.ఫకీర్ బాబు, భాస్కరరావు పాల్గొన్నారు.
యలమంచిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద..
యలమంచిలి, జూన్ 16 :కరోనా మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిచాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. మాజీ జడ్పీటీసీ బోనం నాని, నాయకులు చిట్లూరి ఆంజనేయులు, ఎం.రత్న రాజు, రుద్రరాజు సత్యనారాయణ రాజు, మామిడిశెట్టి పెద్దిరాజు, కడలి గోపి, శనగల శ్రీనివాస్, చిలుకూరి శ్రీనివాస్, పెచ్చెట్టి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి కేశవరావు, తాళ్ళూరి సత్య శ్రీనివాస్, కొండేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నరసాపురంలో..
నరసాపురం రూరల్, జూన్ 18: కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు రూ. 10 లక్షలు సాయాన్ని అందించాలని టీడీపీ మండల నాయకులు డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఽనిరసన తెలిపారు. సివిల్ సప్లై డీటీ సత్యనారాయణకు వినతిపత్రం అందించారు. కొట్టు పండు, మోసుగంటి శేఖర్బాబు, చాగంటి సురేశ్, నడిపూడి కృష్ణ, కె.పాపారావు ఉన్నారు.
పోడూరులో..
పోడూరు, జూన్ 16 : వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పల్లె, పట్టణం అనే తేడాలేకుండా రాష్ట్రం కరోనా కోరల్లో చిక్కుకుందని టీడీపీ మండల అధ్యక్షుడు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గణపతి నీడి రాంబాబు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పెన్మెత్స రామభద్రరాజు, మాజీ జడ్పీటీసీ బొక్కా నాగేశ్వరరావు, ఆచంట ఏఎంసీ మాజీ వైస్చైర్మన్ రుద్రరాజు సీతారామరాజు విమర్శించారు. తహసీల్దార్ పి.ప్రతాపరెడ్డి, ఎంపీడీవో కె.కన్నమనాయుడులకు వినతి పత్రం అందజేశారు.