ప్రభుత్వానికి బుద్ధి, జ్ఞానం ఉందా ?
ABN , First Publish Date - 2020-10-31T04:29:48+05:30 IST
అమరావతి రైతులకు బేడీలు వేసి అక్రమ అరెస్టులను నిరసిస్తూ టీడీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ కర్రా రాజారావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ప్రభుత్వానికి బుద్ధి, జ్ఞానం ఉందా ?
చింతలపూడి, అక్టోబరు 30 : అమరావతి రైతులకు బేడీలు వేసి అక్రమ అరెస్టులను నిరసిస్తూ టీడీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ కర్రా రాజారావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. చింతలపూడిలో గాంధీ విగ్రహం వద్ద ఆయన సంకెళ్ళు వేసుకుని వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి బుద్ధి, జ్ఞానం ఉందా అంటూ విమర్శించారు. ధర్నాలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పక్కాల వెంకటేశ్వరరావు, ధారా వీరేంద్ర, భూషణం, నందిపాం నాగేశ్వరరావు, పండు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుక్కునూరు అంబేడ్కర్ విగ్రహం వద్ద టీడీపీ పోలవరం నియోజకవర్గ ఇన్చార్జి బొరగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.