రోడ్ల మరమ్మతుల్లో ప్రభుత్వ వైఫల్యంపై టీడీపీ నిరసన
ABN , First Publish Date - 2021-07-26T06:59:11+05:30 IST
‘అడుగడుగునా అవినీతి - అడుగుకో గుంత’ చందాన వైసీపీ పాలన ఉందని టీడీపీ నాయకులు విమర్శించారు. టీడీపీ హయాంలో రూ.40 లక్షలతో కొత్తవంతెన నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు పనులు చేపట్టగా నిలిచిపోయిన రహదారిని పరిశీలించి నిరసన తెలిపారు.
అవనిగడ్డ టౌన్, జూలై 25 : ‘అడుగడుగునా అవినీతి - అడుగుకో గుంత’ చందాన వైసీపీ పాలన ఉందని టీడీపీ నాయకులు విమర్శించారు. టీడీపీ హయాంలో రూ.40 లక్షలతో కొత్తవంతెన నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు పనులు చేపట్టగా నిలిచిపోయిన రహదారిని పరిశీలించి నిరసన తెలిపారు. రహదారుల అభివృద్ధి విషయంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. టీడీపీ నేతలు కొల్లూరి వెంకటేశ్వరరావు, యాసం చిట్టిబాబు, అన్నపరెడ్డి లక్ష్మి, గాంధీ, బర్మా శ్రీను, లుక్కా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.