అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న టీడీపీ కౌన్సిలర్లు
ABN , First Publish Date - 2022-01-15T06:16:31+05:30 IST
అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న టీడీపీ కౌన్సిలర్లు
జగ్గయ్యపేట, జనవరి 14: అధికారులు, ప్రజాప్రతినిధులు సంక్రాంతి సంబరాల్లో ఉంటే జగ్గయ్యపేట మునిసిపల్ కాంప్లెక్స్లో కొందరు అక్రమ నిర్మాణానికి తెరలేపారు. రెండు వారాల క్రితం టీడీపీ కౌన్సిలర్లు ఐడీఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ స్థలంలో అక్రమంగా నిర్మాణం చేస్తుంటే కమిషనర్కు ఫిర్యాదు చేయడంతో నిలిపివేశారు. కౌన్సిల్ సమావేశంలో అక్రమ నిర్మాణం నిలిపివేయాలని పాలకపక్ష కౌన్సిలర్లు కోరటంతో.. చైర్మన్ రాఘవేంద్ర, కమిషనర్ సుభాష్ చంద్రబోస్ వాటిని ప్రోత్సహించబోమని, కూల్చేస్తామని హామీ ఇచ్చారు. అక్రమార్కులు మళ్లీ పండుగ సెలవుల్లో అధికారులు ఉండగా, యుద్ధప్రాతిపదికన నిర్మాణం చేపట్టారు. కూలీలను టీడీపీ కౌన్సిలర్లు సామినేని మనోహర్, పేరం సైదేశ్వరరావు, నకిరికంటి వెంకట్, ఇర్రి నరసింహారావులు నిలదీయగా మునిసిపల్ అధికారులు ఎవరూ పనిచేయించటం లేదని, శివ అనేవ్యక్తి కట్టమంటే కడుతున్నామని చెప్పారు. కమిషనర్, చైర్మన్లకు ఫోన్చేయగా మూడో వార్డు సచివాలయం అధికారులు వచ్చి కూలీలను బయటకు పంపారు. తక్షణం కట్టడాన్ని తొలగించకుంటే ఆందోళన చేస్తామని టీడీపీ కౌన్సిలర్లు హెచ్చరించారు.