గోరంట్లను పోలీసులే కాపాడాలనుకోవడం సిగ్గుచేటు

ABN , First Publish Date - 2022-08-20T06:00:40+05:30 IST

అశ్లీల వీడియోతో మహిళలను అవమానపరిచిన ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు కాపాడాలని ప్రయత్నించడం సిగ్గుచేటని టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుల్లెద్దు సుశీలరావు అన్నారు.

గోరంట్లను పోలీసులే కాపాడాలనుకోవడం సిగ్గుచేటు
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్సీ సెల్‌ నేతలు


 19జీఎన్‌టీ41:  


టీడీపీ ఎస్సీసెల్‌ నేతలు

గుంటూరు, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): అశ్లీల వీడియోతో మహిళలను అవమానపరిచిన ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు కాపాడాలని ప్రయత్నించడం సిగ్గుచేటని టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుల్లెద్దు సుశీలరావు అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఐడీ ఉన్నతాధికారి సునీల్‌కుమార్‌ విలేకరుల సమావేశం పెట్టి మరీ అమెరికా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టు ఫేక్‌ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అది నిజం కానప్పుడు ప్రభుత్వం దాన్ని ఎందుకు ఫోరెన్సిక్‌కు పంపడం లేదని ప్రశ్నించారు. పోలీసులు ఎన్ని చెప్పినా ప్రపంచానికి నిజమేమిటో తెలిసిపోయిందన్నారు. ఎస్సీ సెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి గుడిమెట్ల దయారత్నం మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతోమంది ఎస్సీలను పొట్టన పెట్టుకున్నారని, అలాంటి సందర్భంలో సీఐడీ సునీల్‌కుమార్‌ ఎందుకు ఇలా ప్రెస్‌మీట్‌ పెట్టలేదని నిలదీశారు. సమావేశంలో తెలుగుయువత నేత నాగరాజు, ఎస్సీ సెల్‌ నేతలు బత్తుల భాస్కర్‌, పల్లపాటి నవీన్‌  తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-20T06:00:40+05:30 IST