టీడీపీ నాయకుడికి శివరాం పరామర్శ
ABN , First Publish Date - 2022-08-16T03:57:21+05:30 IST
గుడ్లూరు మండలం మోచర్లలో శనివారం రాత్రి డీజే విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన టీడీపీ సీ
కందుకూరు, ఆగస్టు 15: గుడ్లూరు మండలం మోచర్లలో శనివారం రాత్రి డీజే విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన టీడీపీ సీనియర్ నాయకుడు మద్దసాని వెంకటేశ్వర్లును కందుకూరు మాజీఎమ్మెల్యే దివి శివరాం సోమవారం పరామర్శించారు. నెల్లూరులోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేశ్వర్లు వద్దకు వెళ్లి పరామర్శించిన శివరాం పార్టీ అండగా ఉంటుందని అభయమిచ్చారు. ఆయన వెంట నియోజకవర్గ తెలుగుమహిళ అధ్యక్షురాలు దివి సౌభాగ్య, గోచిపాతల మోషే తదితరులున్నారు.