మట్టి అమ్ముకుంటున్న వైసీపీ నేతలు

ABN , First Publish Date - 2021-10-29T05:26:58+05:30 IST

రాజధాని అమరావతి నుంచి, గుంటూరు వరకు వైసీపీ నేతలు మట్టి అమ్ముకుంటున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, తూర్పు ఇనచార్జి మహ్మద్‌ నసీర్‌ తెలిపారు.

మట్టి అమ్ముకుంటున్న వైసీపీ నేతలు
జేసీ రాజకుమారికి వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ నేతలు నసీర్‌ తదితరులు

గుంటూరు, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నుంచి, గుంటూరు వరకు వైసీపీ నేతలు మట్టి అమ్ముకుంటున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, తూర్పు ఇనచార్జి మహ్మద్‌ నసీర్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన పార్టీ నేతలతో కలిసి జేసీ రాజకుమారికి తవ్వకాలకు సంబంధించిన ఆధారాలతో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొంగరాలబీడులో కార్మిక సంక్షేమ శాఖ భూమిలో అక్రమంగా మట్టి దోపిడి చేస్తున్నారని వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ ఎల్లావుల అశోక్‌యాదవ్‌, నాయకులు గోళ్ల ప్రభాకర్‌, కాలే దేవదాస్‌, సూరే శ్రీనివాసరావు, పఠాన జమీర్‌, ఎస్కే ఖుద్దుస్‌, నాయుడు మధు, రసూల్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-10-29T05:26:58+05:30 IST