వైసీపీ పాలనలో అన్నివర్గాలకు అన్యాయం
ABN , First Publish Date - 2022-06-30T05:21:23+05:30 IST
జగన్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని టీడీపీ నగర తూర్పు ఇన్చార్జి మహ్మద్ నసీర్ అన్నారు.
టీడీపీ నగర తూర్పు ఇంచార్జ్ మహ్మద్ నసీర్
గుంటూరు(సంగడిగుంట), జూన్ 29: జగన్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని టీడీపీ నగర తూర్పు ఇన్చార్జి మహ్మద్ నసీర్ అన్నారు. మంగళవారం నగరంలోని తూర్పు నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో నసీర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ సభ్యత్వ నమోదు, క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల నియామకం, బాదుడే బాదుడు కార్యక్రమం, బీసీ సాధికారిక కమిటీ నియామకాలు, అనుబంధ సంఘాలను నియమించడం తదితర అంశాలను చర్చించి నిర్ణయాలు తీసుకుందామని తెలిపారు. జగన్ ప్రభుత్వం అమ్మఒడి పథకంలో లబ్ధిదారులకు పాఠశాల అభివృద్ధి పేరుతో రూ.2వేలు కోత పెట్టడం జగన్ దివాలా కోరుతనానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో డేగల ప్రభాకర్, చిట్టాబత్తుని చిట్టిబాబు, గుడిపల్లి వాణి, ముప్పవరపు భారతి, యల్లావుల అశోక్యాదవ్, పోతురాజు సమత తదితరులు పాల్గొన్నారు.