‘మృగాళ్లు’ రెచ్చిపోతుంటే దిశ ఏమైంది?: లోకేశ్‌

ABN , First Publish Date - 2020-07-01T08:32:32+05:30 IST

‘‘మానవ మృగాలు రెచ్చిపోతుంటే బాధితులకు 21 రోజుల్లో న్యాయం చేసేందుకు తెచ్చిన దిశ చట్టం ఎక్కడ? మహిళలపై అత్యాచారాలు, దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.

‘మృగాళ్లు’ రెచ్చిపోతుంటే దిశ ఏమైంది?: లోకేశ్‌

‘‘మానవ మృగాలు రెచ్చిపోతుంటే బాధితులకు 21 రోజుల్లో న్యాయం చేసేందుకు తెచ్చిన దిశ చట్టం ఎక్కడ? మహిళలపై అత్యాచారాలు, దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. పాలకులే ప్రతీకారంతో చెలరేగిపోతుంటే కొందరు అధికారులు అదే పంథాలో అరాచకంగా వ్యవహరిస్తున్నారు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. నెల్లూరు ఏపీ టూరిజం కార్యాలయంలో మాస్కు పెట్టుకోమన్న దివ్యాంగురాలైన ఓ మహిళా ఉద్యోగిని అత్యంత దారుణంగా హింసించిన డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌ను సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకోవడం కాదు... కఠినంగా శిక్షించాలని మంగళవారం ఆయన ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. మరోవైపు దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ కోటేశ్వర్‌రావు మహిళా ఉద్యోగితో మాట్లాడారు. దారుణంగా వ్యవహరించిన డిప్యూటీ మేనేజర్‌పై దిశ చట్టం కింద కేసు పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-07-01T08:32:32+05:30 IST