దేశంలో విఫలమైన ఏకైక సీఎం జగన్ మాత్రమే: కేశినేని నాని

ABN , First Publish Date - 2020-09-30T17:54:22+05:30 IST

దేశంలో విఫలమైన ఏకైక సీఎం జగన్ మాత్రమే: కేశినేని నాని

దేశంలో విఫలమైన ఏకైక సీఎం జగన్ మాత్రమే: కేశినేని నాని

విజయవాడ: దేశంలో విఫలమైన ఏకైక సీఎం జగన్ మాత్రమేనని ఎంపీ కేశినేని నాని విమర్శించారు. జగన్ ఇష్టం వచ్చినట్లు హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. టీడీపీ సెక్యులర్ పార్టీ... అన్ని మతాలు, కులాలు సమానమేనని చెప్పారు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని చంద్రబాబు కృషి‌చేశారని పేర్కొన్నారు. తన కేసుల కోసం రాజ్యసభలో కేంద్రానికి మద్దతిస్తున్నారని ఆయన చెప్పారు. దేవాలయాలపై దాడులు ఎవరు‌ చేసినా శిక్షించాలని టీడీపీ ‌డిమాండ్ చేస్తుందన్నారు. ఆలయాలపై జరుగుతున్న దాడులకు‌ బాధ్యత వహించి వెల్లంపల్లి రాజీనామా‌ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. 

Updated Date - 2020-09-30T17:54:22+05:30 IST