టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యుల ముందస్తు అరెస్ట్

ABN , First Publish Date - 2021-07-30T21:42:48+05:30 IST

కొండపల్లిలో అక్రమ తవ్వకాలపై టీడీపీ నిజనిర్ధారణ బృందం విచారణ జరపాలని నిర్ణయించింది. అయితే నిజనిర్ధారణ కమిటి

టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యుల ముందస్తు అరెస్ట్

అమరావతి: కొండపల్లిలో అక్రమ తవ్వకాలపై టీడీపీ నిజనిర్ధారణ బృందం విచారణ జరపాలని నిర్ణయించింది. అయితే నిజనిర్ధారణ కమిటి సభ్యులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఇంటికి వచ్చి గృహ నిర్భంధంలో ఉండాలని నిజనిర్ధారణ కమిటీ సభ్యులకు నోటీసులిచ్చారు. ఇంటి బయటకు రాకుండా తలుపులకు పోలీసులు నోటీసులు అంటిస్తున్నారు. విజయవాడలో బోండా ఉమ, గుంటూరులో నక్కా ఆనంద్ బాబు సహా పలువురు నేతలకు నోటీసులిచ్చారు. శనివారం ఉదయం 10 గంటలకు కొండపల్లికి టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వెళ్లనుంది. తమ వెంట మైనింగ్, అటవీ వాఖ అధికారులను పంపాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌కు టీడీపీ నేతలు వినతి పత్రం ఇచ్చారు.

Updated Date - 2021-07-30T21:42:48+05:30 IST