జగన్‌ వైఫల్యంతో ఏపీలో విద్యుత్ కోతలు: ఎంపీ Ram mohan

ABN , First Publish Date - 2022-04-04T17:43:02+05:30 IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఫల్యంతోనే ఏపీలో విద్యుత్ కోతలు ఏర్పడ్డాయని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.

జగన్‌ వైఫల్యంతో ఏపీలో విద్యుత్ కోతలు: ఎంపీ Ram mohan

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఫల్యంతోనే ఏపీలో విద్యుత్ కోతలు ఏర్పడ్డాయని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... మూడేళ్లలో ఏడుసార్లు కరెంట్ బిల్లులు పెంచారని మండిపడ్డారు. పేదలు కరెంట్‌ కూడా వినియోగించుకోలేని విధంగా స్లాబ్స్ తయారు చేశారన్నారు. ప్రజల నుంచి డబ్బులు ఎలా లాక్కోవాలో జగన్‌కు బాగా తెలుసని వ్యాఖ్యలు చేశారు. జగన్‌ వచ్చిన తర్వాత పీపీఏలను రద్దు చేశారన్నారు. పేదలపై దాదాపు 3 వేల కోట్లకు పైగా విద్యుత్ భారం మోపారని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. 

Updated Date - 2022-04-04T17:43:02+05:30 IST