3 బిల్డింగ్లు కూడా కట్టలేని సర్కార్... 3 రాజధానులు కడుతుందా?: కనకమేడల
ABN , First Publish Date - 2022-04-04T17:39:08+05:30 IST
ఏపీ ప్రభుత్వం కోర్టులను పక్కకు పెట్టేలా చూస్తోందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు.
న్యూఢిల్లీ: ఏపీ ప్రభుత్వం కోర్టులను పక్కకు పెట్టేలా చూస్తోందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... అమరావతిపై కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో చిత్తశుద్ధిలేదన్నారు. హైకోర్టు తీర్పును అమలు చేస్తారో లేదో అఫిడవిట్లో పేర్కొనలేదని తెలిపారు. మూడేళ్లలో వైసీపీ సర్కార్ ఒక్క నిర్మాణాన్నీ చేయలేదని విమర్శించారు. మూడు బిల్డింగ్లు కూడా కట్టలేని అసమర్థ ప్రభుత్వం 3 రాజధానులు కడుతుందా? అని ప్రశ్నించారు. రూ.10 వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఘనత జగన్దే అంటూ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ వ్యాఖ్యలు చేశారు.