ప్రత్యేక హోదాపై లోక్‌సభలో గల్లా జయదేవ్ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-12-15T03:54:13+05:30 IST

లోక్‌సభలో బడ్జెట్ పద్దులపై చర్చలో ఎంపీ గల్లా జయదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 8 ఏళ్లైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇంకా పెండింగ్‌లోనే ...

ప్రత్యేక హోదాపై లోక్‌సభలో గల్లా జయదేవ్ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: లోక్‌సభలో బడ్జెట్ పద్దులపై చర్చలో ఎంపీ గల్లా జయదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 8 ఏళ్లైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇంకా పెండింగ్‌లోనే ఉందని ఆయన తెలిపారు. ‘‘విభజన చట్టంలో మొత్తం 18 హామీలు ఇచ్చారు. ఇప్పటికే ఈ అంశాలను లెవనెత్తాం. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని ఇప్పటికీ ఇవ్వలేదు. కడప స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం ఏమీ చేయలేదు. పవర్ కారిడార్‌లో కడప స్టీల్‌ప్లాంట్ కనుమరుగు కాకుండా చూడాలి. ఏపీలో ఇటీవల వచ్చిన వరదల్లో 61 మంది చనిపోయారు. కేంద్రం తక్షణమే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కింద సాయం అందించాలి.’’ అని జయదేవ్ సభ దృష్టికి తీసుకెళ్లారు. 

Updated Date - 2021-12-15T03:54:13+05:30 IST