నేడు కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిని కలవనున్న టీడీపీ ఎంపీలు

ABN , First Publish Date - 2020-07-16T13:30:56+05:30 IST

నేడు కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిని టీడీపీ ఎంపీలు కలవనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ ‌తో భేటి కానున్నారు.

నేడు కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిని కలవనున్న టీడీపీ ఎంపీలు

అమరావతి: నేడు కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిని టీడీపీ ఎంపీలు కలవనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ ‌తో భేటి కానున్నారు. నరేగా పనులకు 13నెలలుగా బిల్లులు చెల్లించక పోవడంపై ఏంపీలు ఫిర్యాదు చేయనున్నారు. కేంద్రం అనేక లేఖలు రాసినా రాష్ట్రప్రభుత్వం బేఖాతరుపై తోమర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే నరేగా నిబంధనలను ఏపీలో కాలరాయడాన్ని కేంద్రమంత్రికి వివరించనున్నారు. ఇళ్లస్థలాల లెవలింగ్‌లో రూ 1,560 కోట్ల స్కామ్‌లపై కూడా టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేయనున్నారు. నరేగా నిధులన్నీ ఒకే పనికి మళ్లించి, ఇతర పనులను నిర్లక్ష్యం చేయడాన్ని కేంద్రమంత్రికి వివరించనున్నారు. ఏపీలో నరేగా స్ఫూర్తికే తూట్లు పొడవడంపై తోమర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. 

Updated Date - 2020-07-16T13:30:56+05:30 IST