పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలి
ABN , First Publish Date - 2021-02-27T04:58:20+05:30 IST
పురపాలక ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పని చేద్దామని ఎమ్మెల్యే మంతెన రామరాజు, ఎమ్మెల్సీ అంరగ రామ్మోహన్ పిలుపునిచ్చారు.
నరసాపురం, ఫిబ్రవరి 26: పురపాలక ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పని చేద్దామని ఎమ్మెల్యే మంతెన రామరాజు, ఎమ్మెల్సీ అంరగ రామ్మోహన్ పిలుపునిచ్చారు. పొత్తూరి రామరాజు నివాసంలో మాజీ ఎమ్మెల్యే మాధవ నాయుడు, ఇతర పార్టీల నాయకులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రెండేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో అవినీతి అజెండాగా ముందుకు సాగాలన్నారు. రత్నమాల, కొప్పాడ రవి, అధికారి అనంతరామారావు, జక్కం శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. నరసాపురం ము న్సిపల్ ఎన్నికల పరిశీలకులుగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యే రామరాజు, ఎమ్మెల్సీ అంగర, మాజీ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పొత్తూరి రామరాజును టీడీపీ అధిష్ఠానం నియమించింది.