జగన్ రైతు దగా పాలనతో రైతులు విసుగెత్తారు: Ramanaidu
ABN , First Publish Date - 2021-09-15T16:21:42+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం మైజారుగుంట గ్రామంలో రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం మైజారుగుంట గ్రామంలో రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించారు. రైతుల పంట పొలాల్లో 200 అడుగుల భారీ నల్లజెండాతో, వందలాది మంది రైతులతో కలిసి టీడీపీ నిరసనకు దిగింది. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ జగన్ పాలనలో పంట పండించడం కంటే పంట విరామం తీసుకుంటే మేలని రైతులంటున్నారన్నారు. జగన్ రైతు దగా పాలనతో రైతులు విసుగెత్తారని తెలిపారు. రైతులకిచ్చే సాయం కంటే ప్రకటనల ఖర్చు ఎక్కువగా ఉంటుందన్నారు. రెండున్నర సంవత్సరాల జగన్ పాలన రైతులకు చుక్కలు చూపించిందని ఎమ్మెల్యే రామానాయుడు వ్యాఖ్యానించారు.